భారత్ లో కరోనా విశ్వరూపం..

భారత్ లో కరోనా మహమ్మారి ఉధృతి ఎంత మాత్రం తగ్గట్లేదు. రోజురోజుకీ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. ఇక తాజాగా కేవలం గడిచిన 24 గంటల్లోనే ఏకంగా 83, 883 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఒక్కరోజులో ఇన్ని కరోనా పాజిటివ్ కేసులు నమోదవడం ఇదే తొలిసారి. ఈరోజుతో భారత్ లో మొత్తం కరోనా  కేసుల సంఖ్య 38,53,407కు చేరింది.

ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 8,15,538.ఇక వైరస్ కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య కూడా భారతీయులను ఆందోళనకు గురిచేస్తోంది. గడచిన 24 గంటల్లో భారత్లో 1,043 మంది కరోనా వల్ల మరణించారు. భారత్లో ఇప్పటివరకూ కరోనాతో 67,376 మంది మరణించగా… 29,70,493 మంది  కోలుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here