భార్య భర్తలు గొడవ పడితే విషయం ప్రధాని నరేంద్రమోదీ వద్దకు చేరింది. అసలు విషయానికొస్తే తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పరకాల ప్రభాకర్ పేరు తెలియని వారు ఉండరు. ఆయన భార్య ప్రస్తుత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. వీరిద్దరీ మధ్య ఇప్పుడు ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఎటాక్ జరుగుతోంది.
ఆక్ట్ ఆఫ్ గాడ్ అంటూ ఓ సినిమాలో విక్టరీ వెంకటేష్ అందరినీ ఆకట్టుకున్నారు. దీంతో ఆక్ట్ ఆఫ్ గాడ్ అనేది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే దేశం ఎదుర్కొనబోయే ఆర్థిక పరిస్థితిపై పరకాల ప్రభాకర్ గత ఏడాదిలోనే మాట్లాడారు. రానున్న రోజుల్లో ఆర్థిక కష్టాలు రానున్నాయని ఆయన గతంలోనే కేంద్రానికి నివేదికలు అందజేశారు. ఇప్పుడు దేశంలో జీడీపీ రేటు తగ్గిపోతూ వస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆక్ట్ ఆఫ్ గాడ్ అంటూ కామెంట్ చేశారు.
దీంతో పరకాల ప్రభాకర్ వెంటనే స్పందించారు. దేశ పరిస్థితి ఏంటో తాను ముందుగానే గ్రహించి కేంద్రానికి తగు నివేదికలు పంపినట్లు చెప్పారు. ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనే ప్రణాళికలు లేకనే ఇలా ఆక్ట్ ఆఫ్ గాడ్ అంటూ మాట్లాడుతున్నారని పరకాల ట్విట్టర్లో విమర్శించారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో కేంద్రం అవలంభిస్తున్న విధానాలు తప్పని తెలిపారు.
మొత్తానికి పరకాల ప్రభాకర్ కామెంట్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. భర్త భార్యపై ఇలా చురకలు వేస్తూ కామెంట్లు చేయడంపై నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ భార్య భర్తల ఆర్థిక గొడవలు ప్రధాని మోదీకి కూడా అంటుకున్నట్లైంది.