పంజాబ్లో కుప్పకూలిన మిగ్-29 యుద్ధ విమానం
ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన యుద్ధ విమానం కూలిపోయిన ఘటన పంజాబ్లో శుక్రవారం చోటుచేసుకుంది. అయితే, ఈ ప్రమాదం నుంచి పైలట్ సురక్షితంగా బయటపడినట్టు ఐఏఎఫ్ తెలిపింది.
యువతితో న్యూడ్ వీడియో కాల్.. రూ.80వేలు సమర్పించుకున్న హైదరాబాద్ టెక్కీ
పోర్న్ సైట్లో కనిపించిన ఫోన్ నంబర్ ఆధారంగా యువతితో పరిచయం పెంచుకున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ సురేశ్ ఆమెతో అనేకసార్లు న్యూడ్గా వీడియో కాల్లో మాట్లాడాడు. దాన్ని రికార్డ్ చేసిన సైబర్ కేటుగాళ్లు అతడి నుంచి డబ్బులు గుంజారు.
గిర్ అడవుల్లో మరోసారి కలకలం.. 23 సింహాలు మృత్యువువాత
గుజరాత్లోని గిర్ అభయారణ్యం సింహాలకు పెట్టింది పేరు. దేశంలో అత్యధికంగా సింహాలు ఉన్న ప్రాంతం ఇదే. ఆ మాటకొస్తే.. ప్రపంచంలోనే అధికంగా సింహాలు ఉన్న ప్రాంతాల్లో ఇదొకటి.
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులపై దుర్భాషలు.. బ్యాంక్ ఉద్యోగినిపై కేసు
రోడ్డుకు అడ్డంగా పార్క్ చేసిన కారును తీయమన్నందుకు ట్రాఫిక్ పోలీసులను దుర్భాషలాడిన ప్రైవేటు బ్యాంక్ ఉద్యోగినిపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.
కిషన్గంగా, రాట్లే ప్రాజెక్ట్లను ఆపండి.. పార్లమెంట్లో పాక్ తీర్మానం
భారత్, పాకిస్థాన్ల మధ్య కొనసాగుతున్న వివాదాల్లో సింధు జలాలు ఒప్పందం కూడా ఒకటి. సింధు ఉపనదులుపై భారత్ నిర్మిస్తున్న ప్రాజెక్టుల వల్ల తమ భూభాగంలో జల లభ్యత తగ్గిపోతుందని పాక్ వాదిస్తోంది.
మద్యం మత్తులో ఘర్షణ.. స్నేహితుడి తలను గోడకేసి కొట్టి దారుణహత్య
మద్యం తాగుతున్న స్నేహితుల మధ్య చెలరేగిన వివాదం ఒకరి ప్రాణాన్ని బలితీసుకుంది. తన కంటే ఎక్కువ మద్యం తాగేశాడని రాజు అనే వ్యక్తిని స్నేహితుడే చంపేశాడు.
కరోనా వైరస్ లైవ్ అప్డేట్స్: దేశంలో మహమ్మారి విజృంభణ.. ముఖ్యంగా ఆ రాష్ట్రాల్లో
కరోనా వైరస్ కోరల్లో చిక్కుకుని ప్రపంచ దేశాలు విలవిలలాడుతున్నాయి. మహమ్మారి దెబ్బకు అగ్రరాజ్యాలు కూడా అల్లాడిపోతున్నాయి. గత కొద్ది రోజులుగా వైరస్ దెబ్బకు చిగురుటాకులా వణుకుతున్న ఐరోపా దేశాలలో మహమ్మారి కాస్త శాంతించిన ఛాయలు కనిపిస్తున్నాయి.
దేశంలో కరోనా: 56వేలు దాటిన కేసులు.. గత 24 గంటల్లో 5వేల మందికి పాజిటివ్
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఏప్రిల్ 20 తర్వాత క్రమంగా పెరుగుతుండటం ఆందోళన వ్యక్తమవుతోంది. గడచిన 10 రోజుల్లో దాదాపు 26వేల మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది.
మైనర్ బాలికతో బంధువు కామవాంఛలు.. గర్భం దాల్చడంతో గుట్టురట్టు
బంధువుల బాలికపై కన్నేసిన ఖాసీం వలీ ఆమెను మాయమాటలతో లోబరుచుకుని అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఫలితంగా ఆమె గర్భం దాల్చింది.
వందే భారత్ మిషన్: స్వదేశానికి భారతీయలు.. తొలి ల్యాండింగ్ కేరళలో
లాక్డౌన్ విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తరలించే ప్రక్రియ మొదలైందది. మే 13 వరకూ సాగే మొదటి విడత కార్యక్రమంలో 12 దేశాల్లోని దాదాపు 15 వేల మంది భారతీయులను తరలించనున్నారు.


