బాలీవుడ్ బాద్షా అమితాబ్ బచ్చన్ కరోనా నుండి కోలుకుని ఇంటికి వెళ్ళారా.. పాజిటివ్ వచ్చి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన త్వరగానే కొలుకున్నారా అంటే కాదనే చెప్పాలి. అయితే పలు మీడియా సంస్థల్లో ఆయన కొలుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ వార్తల నేపథ్యంలో అమితాబ్ బచ్చన్ స్వయంగా రంగంలోకి దిగారు. తనకు నెగటివ్ వచ్చినట్లు చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. అయితే కొన్ని మీడియాల్లో తనకు నెగటివ్ వచ్చి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లినట్లు మీడియాలో వైరల్ అయ్యిందని.. ఇలాంటివి ప్రసారం చేయడం తగదన్నారు.
ఇంకా తాను ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కాగా రెండు రోజుల క్రితం అమితాబ్ బచ్చన్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు చెప్పిన విషయం తెలిసిందే. దీంతో ఆయన బయటకు వచ్చారేమో అన్న వార్తను ఆయన అభిమానులు నమ్మేశారు.