సురేందర్ రెడ్డితో చేతులు కలిపిన అఖిల్…

అఖిల్చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చాడు అక్కినేని నట వారసుడు అఖిల్. అయితే ఇప్పటి వరకు నాలుగు చిత్రాల్లో నటించిన యంగ్ హీరో ఆశించిన స్థాయిలో మాత్రం ఒక్క విజయాన్ని కూడా అందుకోలేకపోయాడు.
దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్న అఖిల్దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తోమోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్అనే చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం సినిమా షూటింగ్ దశలో ఉంది. వైపు సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే.. అఖిల్ మరో సినిమాను ట్రాక్ ఎక్కించే పనిలో పడ్డాడు. క్రమంలోనే పలువురు దర్శకులతో కథా చర్చలు జరిపిన అఖిల్ తాజాగా ఒక సినిమాకు ఓకే చేశాడు.
అఖిల్ తన తరువాత చిత్రాన్ని సురేందర్ రెడ్డితో చేయనున్నట్లు తాజాగా  అధికారిక ప్రకటన వచ్చింది.

సైరా నరసింహారెడ్డివంటి సూపర్ హిట్ తర్వాత సురేందర్ రెడ్డి తెరకెక్కించనున్న సినిమా కావడంతో.. సినిమాపై ఇప్పటి నుంచే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అనీల్ సుంకరతో కలిసిసురేందర్2′ సినిమా బ్యానర్ పై సురేందర్ రెడ్డి సంయుక్తంగా చిత్రాన్ని నిర్మించనున్నారు. చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here