విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో ‘తుగ్లక్ దర్బార్’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో విజయ్కు జోడిగా అదితీ రావ్ హైదరీ నటిస్తోందని తొలుత చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే అనుకోకుండా తాజాగా ఈ సినిమాలో అదితీ నటించట్లేదని తన స్థానంలో రాశీ ఖన్నాను హీరోయిన్గా తీసుకున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో అదితీని సినిమా నుంచి తప్పించారనే వార్తలు పుకార్లు చేశాయి. అయితే దీనిపై స్వయంగా స్పందించింది అదితీ.
తుగ్లక్ దర్బార్ నుంచి తాను స్వయంగా తప్పుకున్నానని చెప్పుకొచ్చిన అదితీ.. ఈ విషయమై మాట్లాడుతూ.. ‘కరోనా కారణంగా భారతీయ చలన చిత్రపరిశ్రమతో సహా ప్రపంచ సినీ లోకమే గత ఎనిమిది నెలలుగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దశలవారీగా పనులు ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాల షూటింగ్లను మొదలుపెట్టాను. షూటింగ్ ప్రారంభించిన ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఇంకా ప్రారంభించని ప్రాజెక్టులు కూడా నా వల్ల ఆలస్యం కాకూడదనుకుంటున్నాను. ప్రస్తుతం కొన్ని కారణాల వల్ల ‘తుగ్లక్ దర్బార్’ నుంచి తప్పకుంటున్నాను. ఈ చిత్రబృందానికి మంచి జరగాలని కోరుకుంటున్నాను. నేను చేయాల్సిన పాత్రను చేయబోతున్న రాశీ ఖన్నాకు ఆల్ ది బెస్ట్’ అని చెప్పుకొచ్చిందీ బ్యూటీ.