రోజా, బొంబాయి లాంటి సినిమాలతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న అరవింద్ స్వామి.. రీసెంట్ గా తెలుగులో ధృవ సినిమాతో ఆకట్టుకున్నాడు. తని ఒరువన్ తమిళ్ సినిమాకు.. తెలుగు రీమేక్ గా రామ్ చరణ్ తో కలిసి చేసిన ఈ సినిమా.. అరవింద్ స్వామికి మంచి పేరును తెచ్చిపెట్టింది.
తర్వాత తెలుగులో అరవింద్ స్వామి ఏ సినిమాలో నటించబోతున్నారన్న ఆసక్తి కూడా అభిమానుల్లో పెరిగింది. రీసెంట్ గా వినిపిస్తున్న న్యూస్ ప్రకారం.. తమిళ్ లో సూపర్ హిట్ అయిన బోగన్ సినిమాను.. మాస్ మహారాజ్ రవితేజ రీమేక్ చేసేందుకు నిర్ణయించాడని తెలుస్తోంది.
తమిళ్ లో జయం రవి, అరవింద్ స్వామి కలిసి చేసిన ఈ సినిమా.. తెలుగులోనూ అరవింద్ స్వామితోనే కలిసి చేసేందుకు రవి ఆసక్తిగా ఉన్నట్టు సమాచారం. అయితే.. ఇప్పటికే తన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.. అరవింద్ స్వామి.
పైగా.. తనకు తెలుగు భాషతో కాస్త ఇబ్బందిగా ఉందని ఓ సందర్భంలో చెప్పాడు. అందుకే.. తెలుగు సినిమాలు చేసే అవకాశం కూడా తక్కువే అని చెప్పాడు. ఈ విషయాన్ని గుర్తు చేస్తున్న అనలిస్టులు.. రవితేజతో అరవింద్ స్వామి బోగన్ రీమేక్ లో నటించడం డౌటే అని అంచనా వేస్తున్నారు. చూడాలి.. ఏం జరుగుతుందో.