జియో యూజర్ లకి మరింత సుభవార్త

రిలయన్స్ జియో ని నెత్తిన పెట్టుకున్నట్టుగా జనాలు ఏదీ నెత్తికి ఎక్కిన్చుకోలేదు. ప్రతీ రోజూ ఫ్రీ కాల్స్ , ఎసెమ్మెస్ , డేటా ఇలా అన్నీ ఫ్రీగా ఇచ్చిన జియో త్వరలో సర్వీస్ కోసం డబ్బులు తీసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ నెలాఖరు తో వీరి హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ ముగుస్తున్న సందర్భంగా జియో మరిన్ని తీపి కబుర్లు చెబుతోంది. ప్రీమియం మెంబెర్ షిప్ ఉన్న వారికి ఈ నెల 1 నుంచీ ముప్పై ఒకటి వరకూ రిజిస్టర్ చేసుకోమంటూఉంది జియో. ఆ గడువు ని ఇప్పుడు ఏప్రిల్ 30 దగా పొడిగించారు.

గత నేలాఖరి వరకూ పది కోట్ల మంది ఖాతదారులని సంపాదించిన జియో కేవలం మూడు కోట్ల మంది మాత్రమే మెంబర్ షిప్ పొందడం తో హ్యాపీగా లేదు. ప్రైం మెంబెర్ షిప్ పొందిన వారిలో దాదాపు ఎనభై శాతం జనాలు కొత్త ఆఫర్ల పట్ల హ్యాపీగా ఉన్నారు అంటోంది జియో. ఇప్పటికే ఉన్న ప్లాన్లు, ఆఫర్ ప్యాక్‌లకు తోడుగా మరిన్ని ఆఫర్లను ప్రవేశ పెడితే దాంతో అందరూ ప్రైం తీసుకుంటారు అనేది జియో ఆలోచన.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here