మరో ఘ‌ట‌న‌.. ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం..

స‌మాజంలో రోజురోజుకూ మాన‌వ‌త్వ విలువ‌లు మంట‌క‌లిసి పోతున్నాయి. కామాంధులు రెచ్చిపోతున్నారు. అభం శుభం తెలియ‌ని చిన్నారుల‌పై లైంగిక దాడుల‌కు పాల్ప‌డుతూనే ఉన్నారు. తాజాగా ఆరేళ్ల చిన్నారిపై అత్యాచార చేశాడో 50 ఏళ్ల వ్య‌క్తి.

ఈ దారుణ‌మైన ఘ‌ట‌న గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. మేడికొండూరు మండం పేరెచెర్ల‌లో బిక్షాట‌న చేసుకుంటూ జీవిస్తున్న ఓ కుటుంబానికి చెందిన ఆరేళ్ల చిన్నారిపై, న‌ల్ల‌పాడుకు చెందిన స్వామ అనే వ్య‌క్తి అత్యాచారం చేశాడు. చిన్నారి క‌నిపించ‌క‌పోవ‌డంతో ఆందోళ‌న చెందిన త‌ల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేయ‌గా విష‌యం బ‌య‌ట‌ప‌డింది. పోలీసులు గాలిస్తున్న స‌మ‌యంలో పేరెచెర్ల జంక్ష‌న్‌లో సీసీ కెమెరాలు ప‌రిశీలించారు.

సీసీ కెమెరాల్లోని విజువ‌ల్స్ ఆధారంగా స్వామి అనే వ్య‌క్తి పాప‌ను తీసుకెళ్లిన‌ట్లు గుర్తించారు. రైల్వేస్టేష‌న్ స‌మీపంలోని పొలాల్లోకి తీసుకళ్లి పాప‌పై అత్యాచారం చేసిన‌ట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు ఫోక్సో చ‌ట్టం కింద కేసు న‌మోదు చేశారు. ఘ‌ట‌న‌పై ప్ర‌జా సంఘాలు తీవ్ర స్థాయిలో మండిప‌డుతున్నాయి. చిన్నారుల‌పై అత్యాచారాల‌కు పాల్ప‌డుతున్న వారిపై వెంట‌నే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు. కాగా రైల్వే స్టేష‌న్‌లో చిన్నారి ఒంట‌రిగా ఏడుస్తూ కూర్చొని ఉండ‌గా గుర్తించి త‌ల్లిదండ్రులు తీసుకెళ్లారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here