నెటిజన్ కామెంట్‌కి ఫన్నీ రిప్లై ఇచ్చిన కేజిఎఫ్ డైరెక్టర్..

సోషల్ మీడియా విస్తృతి పెరిగినప్పటి నుంచి సెలబ్రిటీలకు, అభిమానులకు మధ్య దూరం తగ్గిపోతోంది. అభిమానులు తమ ప్రశ్నలు నేరుగా తారలతో అడిగేస్తున్నారు..  దానికి వారు కూడా సమాధానాలు చెప్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ చేసిన ఓ కామెంటు నెట్టింట్లో వైరల్ గా మారింది.

ఇంతకీ విషయం ఏంటంటే ప్రశాంత్ నీల్ ప్రస్తుతం కేజీఎఫ్‌ 2 చిత్రీకరణలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ తర్వాత షూటింగ్ తిరిగి ప్రారంభించే క్రమంలో.. త్వరలోనే హైదరాబాద్ లో కేజీఎఫ్ 2 షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్లుగా ట్వీట్ చేశాడు. దీంతో ఈ ట్వీట్‌కు ఎన్టీఆర్ అభిమాని కామెంట్ చేస్తూ.. ‘హైదరాబాద్‌ వచ్చాక ఒక సారి కాల్ చేయండి అన్న.. తారక్ అన్నను కలిసి కథను చర్చించేందుకు వెళ్దాం’ అంటూ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ కు ఫన్నీగా బదులిచ్చిన ప్రశాంత్ నీల్.. ‘మీరు ట్వీట్ లో మీ నెంబర్ ఇవ్వడం మర్చిపోయారు’ అంటూ ట్వీట్ చేశాడు. ఇద్దరి ట్వీట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రశాంత్ నీల్ తదుపరి సినిమా ఎన్టీఆర్ తో ఉంటుందనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించి అధికార ప్రకటన మాత్రం ఇప్పటి వరకు రాలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here