దువ్వాడ జగన్నాథం సినిమా క్రిటిక్ లకి విపరీతమైన చిరాకు తెప్పించినా కూడా థియేటర్ లలో మాత్రం గట్టిగానే నడుస్తోంది. వసూళ్ళ విషయం లో స్ట్రాంగ్ గా దూసుకుని పోతున్న ఈ చిత్రానికి మూడు రోజుల్లో అరవై ఐదు కోట్లు వచ్చాయి అని సినిమా విశ్లేషకుడు రమేష్ బాలా అంటున్నారు. వరస గా సెలవలు ఉండడం బాహుబలి తరవాత పెద్ద సినిమాలు లేకపోవడమే దీనికి కారణాలు అని చెప్పచ్చు. డీజే రోజే విడుదల అయిన ట్యూబ్ లైట్ కంటే ఎక్కువగా డీజే వసూళ్లు రాబడుతోంది.
తొలిరోజు రూ.21.15 కోట్లు మాత్రమే వసూలు చేసిన ట్యూబ్ లైట్.. అల్లు అరవింద్ డీజే ముందు తేలిపోయింది. ట్యూబ్ లైట్ కలక్షన్ లు మూడు రోజులకీ కలిపి అరవై నాలుగు కోట్లు దాటలేదు కానీ ట్యూబ్ లైట్ కంటే సగం థియేటర్ లు కూడా లేని డీజే అరవై ఐదు కోట్లు మూడు రోజుల్లో సాధించింది అంటున్నారు. అల్లూ అర్జున్ ఫాన్స్ మాత్రం ఇది ట్రూ అని చెబుతూ ఉన్నా కొందరు మాత్రం ఇవన్నీ బన్నీ అండ్ టీం వేస్తున్న ఫేక్ అని చెప్పేస్తున్నారు