ఏపీలో మరో కలకలం.. అవినీతి అధికారులపై ఏసీబీ డీజీ దాడులు

రవాణా రంగాన్ని దారికి తెచ్చాడు..ఏరికోరి తీసుకొచ్చిన ఏపీ సీఎం జగన్ నమ్మకాన్ని నిలబెట్టాడు. ఇప్పుడు అవినీతిపై యుద్ధాన్ని జగన్ అప్పగించారు.. ఏసీబీ డీజీగా పెద్ద బాధ్యతను ఇచ్చారు. ఆ బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తూ అవినీతి అధికారుల గుండెల్లో నిద్రపోతున్నాడు ఏసీబీ డీజీ సీతారామాంజనేయులు..

ఇప్పటికే తహసీల్దార్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల్లో అవినీతిని అరికట్టిన ఏసీబీ డీజీ సీతారామాంజనేయులు తాజాగా ప్రభుత్వ అధికారులుగా ఉంటూ అవినీతితో కోట్లు కూడబెట్టిన అవినీతి అధికారులపై పడ్డారు.

మంగళవారం ఏపీ వ్యాప్తంగా అవినీతి అధికారులపై ఏసీబీతో దాడులు చేయిస్తున్నారు ఏపీ ఏసీబీ డీజీ సీతారామాంజనేయులు. ఈ దాడుల్లో వందల కోట్ల ఆస్తులు వెలుగుచూస్తున్నాయి.

ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన ప్రభుత్వ అధికారులపై మంగళవారం ఉదయం నుంచి ఏసీబీ దాడులు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. అవినీతి అధికారుల నివాసాలతోపాటు వారి బంధువులు బినామీల ఇళ్లపై ఏకకాలంలో దాడులు జరుగుతున్నాయి. 25 ఏసీబీ బృందాలు దాడులు జరుపుతున్నారు. భారీగా ఆస్తులు, నగలు, నగదు గుర్తించారు.

*ఏపీలో దాడులు జరుగుతున్నది వీరీపైనే…
* శ్రీకాకుళం జిల్లా, పార్వతీపురం ఐటిడిఎ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ టి. మోహన్ రావు,
* విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్, సూపరిటెండెంట్ శ్రీ గంధం వెంకట పల్లం రాజు
* విశాఖపట్నం జిల్లా మాకవరపాలెం మండలం తామరం గ్రామ పి.ఎ.సిఎస్ స్టాఫ్ అసిస్టెంట్ శ్రీ సీరం రెడ్డి గోవిందు
* తూర్పు గోదావరి జిల్లా సీఈవో ఫర్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్, కాకినాడ శ్రీ లంకె రఘు బాబు
* కర్నూలు జిల్లా డిప్యూటీ కలెక్టర్, పి.ఎ. టు స్పెషల్ కలెక్టర్ శ్రీశైలం ప్రాజెక్ట్ శ్రీ సాకే సత్యం

ఇలా అవినీతికి మకిలి పట్టిన అవినీతి అధికారుల తుప్పు వదిలించే పనిలో పడ్డారు ఏసీబీ డీజీ సీతారామాంజనేయులు. రవాణా, రెవెన్యూ, ఇప్పుడు అధికారులపై దాడులతో ఏసీబీ డీజీ సీతారామాంజనేయులు అవినీతి అధికారుల గుండెల్లో నిద్రపోతూ అసలైన పోలీస్ సింగంగా పేరు తెచ్చుకుంటున్నారు. సీఎం జగన్ ఆకాంక్షలను నెరవేరుస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here