यें बलात्कार है, मेरे सपनों का, मेरे हौसलों का, मेरे आत्मसम्मान का और मेरे भविष्य का @INCIndia #NationlUnemploymentDay pic.twitter.com/DHl02Ec0eD
— Kangana Ranaut (@KanganaTeam) September 17, 2020
కంగనా రనౌత్ వర్సెస్ ముంబై ప్రభుత్వం ఎపిసోడ్ రోజురోజుకూ ముదురుతోంది తప్ప తగ్గట్లేదు. ముంబై ప్రభుత్వంపై కంగనా దాడి ఏ మాత్రం తగ్గించట్లేదు. తాజాగా ట్విట్టర్ వేదికగా మహారాష్ట్ర ప్రభుత్వంపై కంగనా ఆగ్రహం వ్యక్తం చేసింది. బీఎంసీ కూల్చివేసిన తన ఆఫీస్ లోని కొన్ని ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేసిన కంగన.. ‘ఇది నా కలలు, నా ఆత్మలు, నా ఆత్మగౌరవం, నా భవిష్యత్తుపై జరిగిన అత్యాచారం” అని ట్వీట్ చేసింది. ఇది అత్యాచారం కాదా? అని ఆమె ప్రశ్నించారు. “ఒకప్పటి దేవాలయాన్ని స్మశానవాటికగా మార్చారు, నా కలలను ఎలా విరిచారో చూడండి? అంటూ కంగనా రనౌత్ వరుస ట్వీట్లు చేసింది.
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ మృతి కేసు పై ముంబై పోలీసుల దర్యాప్తు పట్ల తనకు నమ్మకం లేదని కంగనా ప్రకటించిన తర్వాత ఈ వివాదం మొదలైన విషయం తెలిసిందే.