ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్య బాబ్రీ మసీదు కూల్చివేత కేసు లో బీజేపీ నేథలకి ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో అంతా ఆల్మోస్ట్ తమ ఆధ్వర్యం లో ఉన్నది అనుకున్న టైం లో బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ తో పాటు మరొక సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి అని తిరిగ విచారణ చెయ్యాలి అంటూ సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఇదివరకు అద్వానీ ని విచారణ కోసం అలహాబాద్ హైకోర్టు కి తీసుకొచ్చారు.
ఆపై విచారణ అధికారులు, ఘటన వెనుక అద్వానీ ప్రమేయం ఉందని, కరసేవకులకు ఆయన సహకరించారని ఆరోపిస్తూ, కేసును కొనసాగించేందుకు ఆదేశాలివ్వాలని కోరుతూ సుప్రీంను ఆశ్రయించారు. సుప్రీం దీని మీద విచారణ జరిపించడం కోసం లక్నో లోని ట్రయిల్ కోర్టు లో విచారణ ని చెయ్యాలని ఆదేశించింది