తమిళనాడు రాష్ట్రంలో రాజకీయ ఎంట్రీ ఇచ్చారు దక్షిణాది సినిమా ప్రముఖ హీరోలు కమల హాసన్ రజనీకాంత్. ప్రస్తుతం కమల్హాసన్ రజనీకాంత్ రాజకీయ ఆరంగ్రేటం తమిళనాడు రాష్ట్ర రాజకీయ సమీకరణాలు మార్చేస్తున్నాయి. ఇటీవల కమల్ హాసన్ తన రాజకీయ పార్టీ పేరును గుర్తుని ప్రకటించడం జరిగింది.అయితే ఈ క్రమంలో వీరిద్దరూ రాజకీయాల్లోకి రాకముందు గతంలో ఏకాంతంగా రహస్యంగా కలుసుకున్నారని వార్తలు వినబడుతున్నాయి తమిళనాడు రాష్ట్రంలో.
తమిళ నాట ఒక ప్రముఖ పత్రికకి ఇంటర్వ్యూ ఇచ్చిన కమల్ హాసన్ మాట్లాడుతూ తన పొలిటికల్ ఎంట్రీకి ముందు సూపర్ స్టార్ రజనీ కాంత్ ను రహస్యంగా కలిశాను.ప్రస్తుతం రానున్న రజనీ మూవీ కాలా చిత్రీకరణ సమయంలో రజనీతో మిమ్మల్ని రహస్యంగా మీట్ అవ్వచ్చా అని అడిగాను .దానికి రజనీ అంగీకారం తెలిపారు.దీంతో ఒక కార్లో మేమిద్దరం రహస్యంగా భేటీ అయ్యాము.ఈ క్రమంలోనే తన పొలిటికల్ ఎంట్రీపై పలు అంశాల గురించి చర్చించాం అని ఆయన అన్నారు .
అయితే తను పొలిటికల్ ఎంట్రీ ఇస్తా అని చెప్పగానే ఆయన షాక్ కు గురయ్యారు అని కమల్ ఆ పత్రికలో వివరించారు. అంతేకాకుండా త్వరలో రాజకీయాల్లోకి వస్తున్నా రజనీకాంత్ కూడా తమిళనాడు ప్రజల పట్ల చిత్తశుద్ధి తో పనిచేస్తారనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కమలహాసన్. అయితే ఈ క్రమంలో రజనీకాంత్ పార్టీతో కలుస్తారా అన్న ప్రశ్నకు కమలహాసన్ మాట్లాడుతూ ప్రస్తుతం ఒంటరిగానే రాజకీయాల్లో ముందుకేల్తం భవిష్యత్తు గురించి అప్పుడే చెప్పలేమని అన్నారు.