పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డ కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి

కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెసు నాయకుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడ్డారు. పత్తికొండలో జరిగిన ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన సూర్య ప్రకాశ్ రెడ్డి…. తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ప్రత్యేక హోదా విషయములో తప్పుదోవ పట్టిస్తోందని అన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీనే మేలని టీడీపీ ఎందుకు అంటుందో తెలియడంలేదని ఆయన అన్నారు.
ఇక జనసేన అధ్యక్షుడి వపన్‌కల్యాణ్‌ను ప్రస్తావిస్తూ గత ఎన్నికల్లో టీడీపీ,బీజేపీ కూటమికి బహిరంగ మద్దతు ఇచ్చి రాష్ట్రంలో టీడీపీ విజయం సాధించడం తన ఘనతేనని చెప్పుకుంటున్న ఆయన అప్పుడప్పుడూ మెరుపు తీగ మాదిరి మెరుస్తుంటాడన్నారు. ఆయన వల్ల ఏపీ ప్రజలకు ఏమైన న్యాయం జరిగిందా అని ఆయన ప్రశ్నించారు. తాజాగా కేంద్రం రాష్ట్రాన్ని మోసం చేసిందని పవన్ కళ్యాణ్  వేసిన కమిటీ చంద్రబాబు నాయుడును కాపాడటానికే అని అన్నారు. రాబోయే ఎన్నికలలో కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు మద్దతు తెలిపి ఎన్నికల బరిలో దిగుతారని జోస్యం చెప్పారు కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here