టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం మీద అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్ కాబట్టి ఈ సినిమా మీద టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా ‘రంగస్థలం’ టీజర్ చిత్ర యూనిట్ ఇట్టివాల విడుదల చేయడం జరిగింది. టీజర్ బట్టి చూస్తే హీరో రామ్ చరణ్ పాత్ర పేరు చిట్టిబాబు అని …కానీ ఊర్లో అందరు సౌండ్ ఇంజనీర్ అని పిలుస్తారు.
ఎందుకంటే ఈ సినిమాలో రామ్ చరణ్ చెవిటివాడు. అయితే ఈ సందర్భంగా టీజర్ లో రామ్ చరణ్ చెప్పిన డైలాగ్ హైలెట్ అయ్యింది…అదేంటంటే అందరు చెవితో వెంటే నేను కళ్లతో వింటాను అని చెప్పే డైలాగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆఖట్టుకుంది…అదేవిధంగా ఈ డైలాగ్ లో సుకుమార్కు కనబడింది అని చెప్పవచ్చు. అంతేకాకుండా టీజర్ లాస్ట్ లో చేతిలో కొడవలి పట్టుకుని రామ్ చరణ్ నడిచొస్తుంటే..వెనుక వస్తున్న బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చూస్తుంటే కచ్చితంగా హిట్టు సినిమా అని చెబుతున్నారు ఇండస్ట్రీకి చెందిన వారు. అయితే సినిమాకి సంబంధించి డ్యాన్సుల్లో కూడా రామ్ చరన్ ఇరగదీసినట్టు సమాచారం.ఈ సినిమా మార్చి నెలలో రావడానికి సిద్ధంగా ఉంది.