అప్పుడు అనుష్కతో ఇప్పుడు శ్రద్ధాకపూర్ తో ఘాటుగా రొమాన్స్ చేసేందుకు సిద్ధమయ్యాడు డార్లింగ్ ప్రభాస్. యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో సుజిత్ డైరక్షన్ లో రూ150కోట్లతో నిర్మిస్తున్న సాహోసినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది. అయితే ఈ చిత్రం ఎలా ఉండబోతుంది. నిర్మించడానికి ఎన్నికోట్లు ఖర్చవుతుంది. అనే విషయాలగురించి ప్రభాస్ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించారు.
సినిమా యాక్షన్ జోనర్ లో హాలీవుడ్ ను తలపించేలా నిర్మిస్తున్నట్లు తెలిపాడు. అంతేకాదు శ్రద్ధాకపూర్ తో చేసిన ఘాటుగా రొమాన్స్ ఈచిత్రానికి హైలైట్ అవుతుందని అన్నాడు.డార్లింగ్ మాటల్ని బట్టి చూస్తుంటే గతంలో ప్రభాస్ నటించిన యాక్షన్ ఫిల్మిం బిల్లా ఏవిధంగా అనుష్కతో రొమాన్స్ చేశాడో..ఇప్పుడు అలానే శ్రద్దాకపూర్ తో రొమాన్స్ చేస్తున్నట్లుందని క్రిటిక్స్ అంచనా వేస్తున్నారు.