తాజాగా జరిగిన కాదలి సినిమా ఆడియో ఫంక్షన్ కి రామ్ చరణ్ – కేటీఆర్ లు ముఖ్య అతిధులు గా వచ్చారు. ఈ ఈవెంట్ లో రామ్ చరణ్ మాట్లాడాల్సిన టైం లో దాసరి ని గుర్తుకు తెచ్చుకోవడం విశేషం. అందరూ ఆయన గురించి మాట్లాడకపోయినా రామ్ చరణ్ స్వయంగా ‘ముందుగా దాసరి గారు చనిపోయిన తర్వాత జరుగుతున్న పెద్ద ఫంక్షన్ ఇది కావడంతో.. అందరం ఒక నిమిషం మౌనం పాటిద్దాం’ అంటూ దాసరి ని తలచుకునేలా చేసాడు. మొన్నటికి మొన్న జరిగిన దువ్వాడ జగన్నాథం ట్రైలర్ లాంచ్ లో కూడా ఎవ్వరూ దాసరి పేరు ఎత్తలేదు.
ఇండస్ట్రీ లో కీలక నిర్మాత అయిన దిల్ రాజు సైతం దాసరి పేరు ఎత్తకపోగా ఆ ఈవెంట్ కి వచ్చిన దాదాపు పాతిక మంది డైరెక్టర్ లు దాసరి పేరు ఎత్తనే లేదు. రామ్ చరణ్ కి ఉన్న ఆ మాత్రం జ్ఞానం దిల్ రాజు కి లేదా అంటూ తిట్టి పోస్తున్నారు ఫిలిం నగర్ జనాలు.