కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఎదురుచూస్తున్నారు. అయితే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ప్రజలకు పలు రకాల దుష్ప్రలితాలు వస్తుయని పుకార్లు ఎక్కువవుతున్నాయి. ఇందుకు నిదర్శంగానే పలు ఘటనలు కూడా వెలుగు చూస్తున్నాయి.
టెనస్సీలోని ఫైజర్-బయోఎన్టెక్ కోవిడ్-19 వ్యాక్సిన్ షాట్ అందుకున్న హెడ్ నర్సు టిఫనీ డోవర్ ప్రెస్ ప్రశ్నలకు సమాధానాలిస్తూ అకస్మాత్తుగా అస్వస్థతకు గురైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది . దీంతో వ్యాక్సిన్ భద్రత, సమర్థతపై తీవ్రమైన సందేహాలను రేకెత్తించింది.టేనస్సీలోని సీహెచ్ఐ మెమోరియల్ హాస్పిటల్ ఎన్ చత్తనూగలో విలేకరుల సమావేశంలో టిఫనీ డోవర్ మాట్లాడుతూ, టీకా తీసుకోవడం సంతోషిస్తున్నానని ప్రకటించారు. తర్వాత విలేకరుల సమావేశంలోనే మూర్ఛపోవడం కలకలం రేపింది.
ఈ దృశ్యాలు కెమెరాల్లో రికార్డయ్యాయి. క్షమించండి, మైకం కమ్ముతోందంటూ ఆమె మూర్ఛపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇపుడు వైరల్ గామారింది. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు సమాచారం. అమెరికాలో ఫైజర్-బయోఎన్టెక్, మెడర్నా వ్యాక్సిన్లకు రెగ్యులేటరీ అనుమతి లభించింది. అయితే క్లినికల్ ట్రయల్స్ నుండి సేకరించిన భద్రతా డేటాను విశ్లేషించిన తరువాత మాత్రమే వ్యాక్సిన్లకు గ్రీన్ సిగ్నల్ లభించినప్పటికీ టీకాల భద్రత సమర్ధతపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.