ఆంధ్రప్రదేశ్లో కొడాలి నాని పేరు తెలియని వారుండరు. ఎందుకంటే ఆయన ఏపీ మంత్రిగానే కాకుండా ఏదైనా ఉన్నది ఉన్నట్లు మాట్లాడే వ్యక్తిగా ఆయన ప్రజల్లోకి బాగా వెళ్లారు. ఎక్కువగా తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు, లోకేష్పై ఆయన మాట్లాడుతుంటారు.
ఇప్పుడు మంత్రి కొడాలి నాని మరోసారి నారా లోకేష్పై విరుచుకుపడ్డారు. లోకేష్కు కొన్నింటికి తేడానే తెలియదని అన్నారు. లోకేష్కు వరి చేనుకి చేపల చెరువుకు తేడా తెలియదని ఎద్దేవాచేశారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని అడిగినందుకు బషీర్బాగ్లో.. రైతులపై కాల్పులు జరిపిన చరిత్ర చంద్రబాబుదని గుర్తుచేశారు. అమరావతిలో భూములకు రేటు పడిపోయిందని, రైతులను అడ్డుపెట్టుకుని గోతికాడ నక్కలా బతుకుతున్నారని ఆరోపించారు. రైతులకు సంకెళ్లు వేశారని దేవినేని ఉమ కూడా వేసుకోవడం కాదని, బషీర్బాగ్ ఘటనలా మీరూ కాల్చుకుంటే బాగుంటుందన్నారు.
ఇక వర్షాలు, వరదల గురించి మాట్లాడుతూ దేశంలో విపత్తులు వస్తే ప్రధానితో పాటు సీఎంలు ఏరియల్ సర్వే చేస్తారన అన్నారు. అయితే కరోనా భయంతో చంద్రబాబు ఇంట్లో కూర్చున్నాడని కొడాలి నాని విమర్శించారు. దీంతో ఈ వ్యాఖ్యలు మరోసారి దుమారం రేపుతున్నాయి. పలువురు కొడాలి నాని మరోసారి నోరు పారేసుకున్నారని అంటుంటే.. మరి కొందరు మాత్రం ముక్కుసూటిగా మాట్లాడుతున్నారని ఆయన్ను వెనకేసుకొస్తున్నారు. ఏది ఏమైనా రాష్ట్రంలో కొడాలి నాని ఏం మాట్లాడాని హాట్ టాపిక్ అవుతుంది అనడంలో సందేహమే లేదు.