ఉత్తరప్రదేశ్లోని హథ్రాస్లో యువతి ఘటనలో ఏదేదో జరుగుతున్నట్లు తెలుస్తోంది. పలు ఆడియో టేపులు బయటకు రావడం సంచలనంగా మారింది. బాదితురాలి కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడిన గుర్తు తెలియని వ్యక్తి భారీ కుట్ర పన్నినట్లు అర్థమవుతోంది.
హథ్రాస్లో బాదితురాలి కుటుంబ సబ్యులతో ఓ వ్యక్తి ఫోన్లో మాట్లాడాడు. అందులో ఏముందంటే.. 25 లక్షల రూపాయలు కాదు.. రూ. 50 లక్షలు డిమాండ్ చేయండి అని ఓక్లిప్లో ఉందట. ఇంకో ఆడియోలో మీడియా ముందు మాట్లాడే సమయంలో పోలీసులు, ప్రభుత్వంపై వ్యతిరేకంగా మాట్లాడాలని ఉంది. ఇంకో ఆడియోలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ప్రియాంక వచ్చే వరకు వేచి చూసి ఆతర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలని ఉందని తెలిసింది. అయితే ఈ ఆడియో టేపుల్లో ఎవరు మాట్లాడారనేది ఇంకా తెలియలేదు. కాగా ఈ ఆడియోలు ఎక్కడికి, ఎవరు మాట్లాడారు, హథ్రాస్ ఘటన బాదితురాలి కుటుంబ సభ్యులవేనా అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఏదిఏమైనా ఈ ఆడియోలు మాత్రం ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. ఇప్పటికే హథ్రాస్ ఘటన దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. రాజకీయ నాయకులు బాదితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్లగా పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. మరి ఇప్పుడు ఈ ఆడియో టేపులు బయటకు రావడం చర్చనీయాంశమైంది. ఈ ఆడియోల గురించి క్లారిటీ వస్తే అక్కడ ఏం జరుగుతుందో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.