ఆట ఇప్పుడే మొదలైంది..!

కాజల్‌ అగర్వల్‌, మంచు విష్ణు ప్రధాన తారగణంగా ‘మోసగాళ్లు’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. టైటిల్‌ ప్రకటించిన నాటి నుంచి ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరీ ముఖ్యంగా ప్రపంచంలో అతిపెద్ద ఐటీ స్కాం అనే నేపథ్యంతో తెరకెక్కుతోన్న చిత్రం కావడం.. హాలీవుడ్‌ డైరెక్టర్‌ దర్శకత్వం వహిస్తోన్న సినిమా కావడంతో ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ దృష్టి కూడా ‘మోసగాళ్ల’పై పడింది.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన చిన్న టీజర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ చేతుల మీదుగా ఈ టీజర్‌ను విడుదల చేశారు. ఇక టీజర్‌ విషయానికిస్తే.. 2016లో అమెరికాలో జరిగిన 450 మిలియన్‌ డాలర్ల అతి పెద్ద ఐటీ స్కామ్‌ గురించి ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మీడియా సమావేశంలో మాట్లాడే స్పీచ్‌తో టీజర్‌ ప్రారంభమవుతుంది. ఆ డబ్బును భారత్‌లో ఉండే కాజల్‌, విష్ణు దోచుకుంటారు. బస్తాల్లో భారీ ఎత్తున కుక్కిన డాలర్లను చూస్తూ.. ‘ఇది సరిపోతుందిగా’ అని కాజల్‌ ప్రశ్నించగా.. దానికి విష్ణు బదులిస్తూ.. ‘ఆట ఇప్పుడే మొదలైంది’ అని చెప్పే డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా విడుదల చేయనున్న ఈ సినిమాకు హాలీవుడ్‌ దర్శకుడు జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. మరి ఇండియన్‌ స్ర్కీన్‌పై ఈ సినిమా ఎలాంటి సంచలనాలకు తెరతీస్తుందో చూడాలి. ఆసక్తికరంగా ఉన్న ఆ టీజర్‌పై మీరూ ఓ లుక్కేయండి.

https://youtu.be/F8awPo7DiOA

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here