తండ్రి ప్రియదర్శన్ నట వారసత్వం ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది నటి కళ్యాణి ప్రియదర్శన్. నటన కంటే ముందు ఈ చిన్నది తెర వెనక పనిచేసింది. 2013లో వచ్చి ‘క్రిష్ 3’కి అసిస్టెంట్ ప్రొడక్షన్ డిజైనర్గా సేవలందించింది. అనంతరం తమిళ సినిమా ‘ఇరు ముగన్’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేసింది. పేరుకు తమిళ అమ్మాయి అయిన కళ్యాణి.. తెలుగు సినిమాతోనే వెండితెరకు నటిగా పరిచయమైంది. అఖిల్ హీరోగా నటించిన ‘హల్లో’ చిత్రంతో మొదటిసారి వెండితెరపై ప్రత్యక్షమైంది. ఇక అనంతరం ‘చిత్ర లహరి’తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. తన క్యూట్ లుక్, నటనతో ఆకట్టుకునే కళ్యాణి ప్రస్తుతం చేతిలో నాలుగు సినిమాలతో బిజీగా ఉంది.
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే కళ్యాణ్ తన వృత్తి పరమైన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా దుబాయ్లో స్కై డైవింగ్ చేస్తోన్న సమయంలో తీసిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిందీ చిన్నది. ఇక ఈ ఫొటోలతో పాటు.. ‘బయటకి నవ్వుతూ ఉన్నా లోపల మాత్రం ఏడుస్తున్నాను’ అనే ఫన్నీ క్యాప్షన్ను జోడించింది. లాక్డౌన్ కారణంగా కొన్ని నెలలపాటు ఇంటి పట్టునే ఉన్న ఈ చిన్నది తాజాగా దుబాయ్లో విహార యాత్రలో సేదతీరుతోంది.