కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్లోని హథ్రస్లో బాదిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతున్న రాహుల్పై పోలీసులు ప్రవర్తించిన తీరు అందరికీ తెలిసిందే. దీంతో దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీకి మద్దతు పెరుగుతోంది. ఈ విషయంపై సంజయ్ రౌత్ మాట్లాడారు.
రాహుల్ పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరుపై ఆయన విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ జాతీయ పార్టీ అగ్రనేత అన్న విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. తమకు, రాహుల్కు విభేదాలు ఉన్నాయని సంజయ్ అన్నారు. అయినప్పటికీ ఓ పార్టీ నేతను ఇలా కాలర్ పట్టుకొని లాగడం మంచిది కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. నిన్న జరిగిన ఘటనను ప్రజాస్వామ్యంపై అత్యాచారంగా ఆయన అభివర్ణించారు.
ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ లాంటి గొప్ప నాయకులు ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి పట్ల ఇలా వ్యవహరించడం సరైంది కాదన్నారు. పోలీసులు అడ్డుకున్న సందర్బంలో అక్కడ జరిగిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పోలీసుల తీరుపై అందరూ విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా నేడు కూడా హథ్రాస్లో పోలీసులు ఇలానే వ్యవహరిస్తున్నారు. నాయకులెవ్వరినీ హథ్రాస్ లో బాదితురాలి కుటుబ సభ్యులను పరామర్శించేందుకు అనుమతించడం లేదు. దీంతో అందరూ మండిపడుతున్నారు.