ఏపీలో ఓ మంత్రిపై సీఎం వై.ఎస్ జగన్ సీరియస్గా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఆయనపై వచ్చిన ఆరోపణలు కూడా ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేస్తున్నట్లు పార్టీలో డిస్కషన్ జరుగుతోందన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాంపై ఇటీవల ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఆయన కుమారుడు ఓ కేసులో ముద్దాయిగా ఉన్న వ్యక్తి నుంచి బెంజి కారును గిఫ్టుగా తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. టిడిపి నేతలు ఈ విషయాన్ని ప్రెస్ మీట్లు పెట్టి మరి చూపించారు. దాదాపు ఓ వారం రోజుల పాటు ఈ అంశాన్ని టిడిపి రాజకీయంగా వాడుకుంది. ఈ కేసులో ఏసీబీ కాల్ సెంటర్కు కూడా టిడిపి ఫిర్యాదు చేసింది. అయితే ఇప్పుడు ఇదే అంశంలో సీఎం సీరియస్గా ఉన్నారని తెలుస్తోంది.
రాష్ట్రంలో ఎప్పుడూ చెయ్యని విధంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. అన్ని వర్గాల ప్రజలను సంతృప్తి పరచడంలో సీఎం జగన్ గెలిచారని అంతా అనుకుంటున్నారు. ప్రతిపక్షాలకు మాట్లాడటానికి కూడా ఎలాంటి అవకాశం లేకుండా జగన్ పరిపాలన సాగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మంత్రివర్గంలో ఒకరిద్దరు చేస్తున్న పనులు ఆయనకు తలనొప్పిగా మారాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అందుకే ఏం చేద్దామనే నిర్ణయానికి అధినాయకత్వం వచ్చిందా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏ చిన్న వ్యక్తిని కదలించినా రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం బాగా పరిపాలన చేస్తోందనే చెబుతారు. ఇలాంటి సమయంలోనే ఈ ఆరోపణలు కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకు వస్తాయి. అయితే తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడదేని మంత్రి గుమ్మనూర్ అంటున్నారు. అయితే ఈ విషయంలో ఈయనకు మద్దతు తెలిపిందేకు సహచర మంత్రులు, ఇతర కీలక నేతలు మందుకు రావడం లేదన్నది ఇప్పుడు ప్రతిపక్షాలు ఆవకాశాంగా చేసుకుంటున్నాయి.
ఇప్పటికే ఈ విషయంలో సీఎం సీరియస్గా ఉన్నారన్న వార్తలు ఈ మధ్య ఎక్కువయ్యాయి. అయితే మంత్రి జయరాం.. సీఎం జగన్తో ఇప్పటికే భేటి అయ్యి చర్చించారన్న పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఏది నిజమో తెలియడం లేదు. నిజంగా తప్పు చేసినట్లు తేలితే ఇప్పటికే జగన్ చర్యలు తీసుకొని ఉండేవారని పబ్లిక్ టాక్. మరి ఈ మంత్రి విషయంలో ప్రతిపక్షాలు కావాలనే అనవసర పుకార్లు పుట్టిస్తున్నాయని వినికిడి.