సమాజం శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందుతున్నా.. ఇప్పటికీ అమ్మాయిలపై వివక్షత కొనసాగుతూనే ఉంది. ఆడపిల్ల పుట్టిందంటే ఏదో భారంగా ఫీలయ్యేవారు ఇప్పటికీ సమాజంలో ఉన్నారు. చదువుకున్న విద్యావంతులు కూడా దీనికి అతీతులేం కాదు. అయితే అబ్బాయిల కంటే అమ్మాయిలే చాలా బెటర్ అని చెబుతున్నారు దర్శకుడు పూరి జగన్నాథ్. ఆదివారం ( సెప్టెంబర్ 27) కూతుళ్ళ దినోత్సవాన్ని పురస్కరించుకొని.
ఒక అద్భుతమైన ఆడియోని విడుదల చేశాడు పూరి. గత కొన్ని రోజులుగా పూరి మ్యూజింగ్స్ పేరుతో తనకు నచ్చిన అంశాలపై ప్రజలలో అవగాహన కల్పించడానికి కొన్ని ఆడియోలను విడుదల చేస్తున్న పూరి జగన్నాథ్.. తాజాగా కూతుర్ల గొప్పతనాన్ని వివరిస్తూ కొత్త ఆడియోను విడుదల చేశాడు. మరి పూరి జగన్నాథ్ కూతుళ్ల గొప్పతనం గురించి ఏం చెప్పాడు కింది వీడియోలో మీరు వినండి…