హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో జరిగిన కారు ప్రమాదం లో చనిపోయిన నిశిత్ ఫామిలీ ని పరామర్శించడం కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అపోలో ఆసుపత్రికి వచ్చారు. పవన్ కళ్యాణ్ ని చూసిన వెంటనే నారాయణ కుటుంబం విపరీతంగా విలపించడం తో పవన్ వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. నారాయణ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ పోలీసులతో కూడా మాట్లాడారు.
అనంతరం రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ఉండేలా యువత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆ కాసేపటికే జూబ్లీ హిల్స్ కి మృతదేహం తో పాటు చేరుకున్న పవన్ కళ్యాణ్ హరీష్ రావు ఇతర తెలంగాణా, ఏపీ మినిస్టర్ లతో పాటు వారి ఇంటి ప్రాంగణం లో కూర్చోవడం కనిపించింది. ఇది అరుదైన దృశ్యం గా ఇంటర్నెట్ లో ఫోటో హల్చల్ అవుతోంది.