లేడీ అమితాబ్ గా ఉక్కు మనిషి గా పేరున్న విజయశాంతి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. సినిమాల్లోకి ఆమె రీ ఎంట్రీ అంటూ వార్తలు వచ్చినా ఆమె ఎక్కడా ఈ విషయాన్ని ధృవీకరణ చెయ్యలేదు. అయితే మనకి అందుతున్న సమాచారం ప్రకారం ఈమె కాలికి ఆ సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టిన కొత్తల్లో ఫాక్చర్ అయ్యిందట.
లేగ్మేంట్ కి ఇబ్బంది కలిగి కదలడం తో చాలా కాలం పాటు పదానికి చికిత్స చేసారు. పాదం వరకూ కూడా ఆపరేషన్ పడింది అని అంటున్నారు . ఇక మీదట చాలా జాగ్రత్తగా ఉండాలి అని సూచించడం తో ఆమె ఇక సినిమాలకి గుడ్ బై చెప్పెసినట్టు అంటున్నారు. కొంతకాలం పాటు బెడ్ రెస్ట్ కూడా అవసరమని చెప్పారట. అయితే.. కొన్ని వారాలు మాత్రమే రెస్ట్ తీసుకున్న విజయశాంతి.. తిరిగి వర్కవుట్స్ మొదలుపెట్టేశారని సన్నిహితులు అంటున్నారు. రోజులో గంటన్నర సేపు ఆమె జిమ్ లో గడుపుతున్నారట