స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల ఆదిలాబాద్ లోని కుంటాల జలపాతంతో పాటు మహారాష్ట్ర లోని పలు ప్రాంతాలను సందర్శించిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులతో పాటు, పుష్ప చిత్ర యూనిట్ కూడా ఈ టూర్ కు వెళ్ళింది. పనిలో పనిగా చిత్ర షూటింగ్ కోసం లొకేషన్లను కూడా వెతికారని వార్తలు వచ్చాయి. అయితే కోవిడ్ నిబంధనలున్న సమయంలో బన్నీకి ఎలా అనుమతించారంటూ అప్పట్లో సోషల్ మీడియాలో పలువురు కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఏకంగా బన్నీ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అల్లు అర్జున్ కోవిడ్-19ప్రోటోకాల్ పాటించని కారణంగా చర్యలు తీసుకోవాలని సమాచార హక్కు సాధన స్రవంతి ప్రతినిధులు ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
కుంటాల జలపాతం సందర్శనను నిలిపివేసినా అల్లు అర్జున్ సహా పుష్ప సినిమా యూనిట్ సభ్యులు అందరూ కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి జలపాతాన్ని సందర్శించడమే కాకుండా తిప్పేశ్వర్లో అనుమతులు లేకుండా షూటింగ్ చేశారని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవులపల్లి కార్తిక్రాజు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, ప్రాథమిక విచారణ అనంతరమే దీనిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు.