గోషామహల్ ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీ సభ్యుడు టి. రాజా సింగ్ వ్యక్తిగత ఖాతాపై ఫేస్ బుక్ నిషేధాన్ని విధించింది. ద్వేషపూరిత, వివాదాస్పద పోస్టులు పెట్టడంతో.. రాజా సింగ్ తమ సంస్థ నియమాలను పాటించలేదని ఫేస్ బుక్ యాజమాన్యం తెలిపింది. హింసను ప్రేరేపించే విధంగా వివాదాస్పద పోస్టులు చేసి ఎమ్మెల్యే తమ నియమాలను ఉల్లంఘించారని ఫేస్ బుక్ ప్రతినిధి తెలిపారు. రాజా సింగ్ ఫేస్ బుక్ తో పాటు ఇంస్టాగ్రామ్ ఖాతాను కూడా తొలగించారు.