ఒకప్పుడు సినీ తారలు అంటే కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు కానీ ఇప్పుడు రోజులు మారాయి. సోషల్ మీడియా విస్తృతి పెరిగిన నాటి నుంచి అభిమానులతో నిత్యం టచ్ లో ఉంటున్నారు. తమలోని వివిధ ప్రతిభలను బయటపెడుతున్నారు. ఇప్పటికే చాలా మంది నటీమణులు యూట్యూబ్ లో ఛానల్స్ ను ఓపెన్ చేసి వీడియోలను అప్ లోడ్ చేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి వచ్చి చేరింది నటి లావణ్య త్రిపాఠి. తన యూట్యూబ్ ఛానెల్ లో మొదటి వీడియోగా మణిరత్నం క్లాసిక్ మూవీ ‘ముంబాయి’ సినిమాలోని ‘కన్నానులే’ అనే పాటకు డ్యాన్స్ చేస్తోన్న వీడియోను అప్ లోడ్ చేసింది. ఇందులో లావణ్య ఉమాంగ్ గుప్త అనే మరో యువతితో కలిసి చేసిన డ్యాన్స్ ఆకట్టుకుంటోంది. ఇక
బ్యాక్ గ్రౌండ్ లో అద్బుతమైన ఆకుపచ్చటి అడవి మధ్యలో రోడ్డుపై వైట్ డ్రస్ లో ఇద్దరు వేసిన స్టెప్పులు వావ్ అనిపిచ్చేలా ఉన్నాయి. లావణ్య అదిరే స్టెప్పులపై మీరూ ఓ లుక్కేయండి.