హైదరాబాద్ బంజారాహిల్స్‌లో భారీ చోరీ జరిగింది.

హైదరాబాద్ బంజారాహిల్స్‌లో భారీ చోరీ జరిగింది. నగరంలోని ప్రముఖ బిల్డర్ ఆఫీస్‌లోకి చొరబడి విలువైన డాక్యుమెంట్లతో పాటు ఒక రివాల్వర్ కూడా దుండగులు ఎత్తుకెళ్లారు. దీంతో యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల సీసీటీవీ కెమెరాల పుటేజ్ చూసి నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్‌లో ఉన్న శ్రీ ఆదిత్య హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆఫీస్‌లో ఈ చోరీ జరిగింది.

సుధీర్ రెడ్డి అనే వ్యక్తి చొరబడి రూ.పది కోట్ల విలువైన భూములకు సంబంధించిన పత్రాలను శ్రీ ఆదిత్య హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆఫీస్‌‌లో దొంగిలించడమే కాకుండా ఒక రివాల్వర్‌తో పాటు 20 బుల్లెట్లను కూడా చోరీ చేశాడు. ఉదయం శ్రీ ఆదిత్య హోమ్స్ చైర్మన్ వీరప రెడ్డి కోటారెడ్డి అక్కడకు వచ్చినప్పుడు ఆఫీసులో చోరీ జరిగినట్లుగా గుర్తించి వెంటనే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీసీటీవీ పుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితుల్ని గుర్తించారు. నిందితుడు సుధీర్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here