భ‌క్తులంద‌రికీ శ‌బ‌రిమ‌ల ప్ర‌సాదం ఇంటికే వ‌స్తుంది..

క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న నేప‌థ్యంలో భ‌క్తుల‌కు గుడ్ న్యూస్ వ‌చ్చింది. క‌రోనా కార‌ణంగా ఆల‌యాల‌కు అనుమ‌తించ‌డానికి ప‌లు నిబంధ‌న‌లు పెట్టారు. అయితే శ‌బ‌రిమ‌ల ఆలయం అంద‌రికీ శుభ‌వార్త చెప్పింది.

శబరిమల దేవాలయం నుంచి స్వామివారి ప్రసాదాన్ని స్పీడు పోస్టు ద్వారా భక్తులకు చేరవేయాలని భారత తపాలా శాఖ నిర్ణయించింది. తపాలా శాఖ తనకున్న విస్తారమైన నెట్ వర్కును ఉపయోగించి దేశం నలుమూలల ఉన్న భక్తులకు ప్రసాదాన్ని ఇంటివద్ద డెలివరీ చేయాలని నిర్ణయించింది. దీనికోసం కేరళ పోస్టల్ సర్కిల్ ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డుతో ఒప్పందం కుదుర్చుకుంది. శబరిమల ప్రసాదం ప్యాకెట్ ను 450 రూపాయలు చెల్లించి భక్తులు ఏ పోస్టాఫీసు నుంచి అయినా బుక్ చేసుకోవచ్చు.

నేతితో కూడిన ప్రసాదంతోపాటు విభూతి, కుంకుమ, పసుపు, అర్చన ప్రసాదం ప్యాకెట్ లు ఉంటాయి. ఒక భక్తుడు ఒకేసారి పది ప్యాకెట్ల ప్రసాదం వరకు బుక్ చేసుకోవచ్చు. ప్రసాదం స్పీడ్ పోస్టు కింద బుక్ చేసుకోగానే వెంటనే నంబరుతో సందేశం భక్తుడికి వస్తుంది. ప్రసాదం కదలికను వెబ్ సైట్ లో లాగిన్ అయి తెలుసుకోవచ్చు. శబరిమల ప్రసాదం కోసం 9వేల మంది భక్తులు బుక్ చేసుకున్నారు. నవంబరు 16 నుంచి శబరిమల ఆలయాన్ని తెరిచినా కొవిడ్ కారణంగా కఠినమైన నిబంధనలు పాటించాల్సి వస్తోంది. ఈ సీజనులో తక్కువ సంఖ్యలో భక్తులను మందిరం సందర్శనకు అనుమతించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here