వెబ్‌ సిరీస్‌ డైరెక్ట్‌ చేయనున్న మరో దర్శకుడు..

వెబ్‌ సిరీస్‌లపై ఆదరణ పెరుగుతుండడంతో ఓవైపు సినీతారలు, మరో వైపు దర్శకులు కూడా వీటిపై దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖ దర్శకులు, బడా స్టార్‌లు వెబ్‌ సిరీస్‌ల బాట పట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి మరో దర్శకుడు వచ్చి చేరారు. ఆయనే వేగేశ్న సతీష్‌. ‘శతమానం భవతి’, ‘శ్రీనివాస కళ్యాణం’, ‘ఎంత మంచి వాడవురా’ వంటి వరుస విజయాలను అందుకున్న వేగేశ్న తాజాగా ఓ వెబ్‌ సిరీస్‌ను నిర్మించనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటి వరకు కుటుంబ కథలతో కూడిన సినిమాలను తెరకెక్కించిన సతీష్‌ వెబ్‌ సిరీస్‌లో మాత్రం విభిన్న పంథాను ఎంచుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ వెబ్‌ సిరీస్‌ను ఇన్వేస్టిగేటివ్‌ క్రైమ్‌ డ్రామా కథతో ప్రేక్షకులను ఉత్కంఠ భరితంగా సాగే థ్రిల్లర్‌ నేపథ్యంలో ఉండనుందని సమాచారం. ఈ వెబ్‌ సిరీస్‌లో మొత్తం తొమ్మిది ఎపిసోడ్లు ఉంటాయని తెలుస్తోంది. ఈ వెబ్‌ సిరీస్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here