కరోనా మహ్మామారి ప్రపంచవ్యాప్తంగా చాలా వేగంగా వ్యాప్తి చెందుతూ లక్షల్లో మానవాళి ప్రాణాల్ని హరించేస్తున్న సంగతి తెలిసిందే..! అయితే ఈ వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో ప్రజలందరూ ఇళ్లకే పరిమతం అవుతున్నారు. దీంతో ఆన్ లైన్ వ్యూయర్ యాక్టివిటీ కూడా పెరిగిందని తాజాగా జరిగిన ఎనాల్సిస్ రిపోట్లు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సౌత్ ఇండియాలోనే అగ్రగామి మ్యూజిక్ కంపెనీగా కొనసాగుతున్న ఆదిత్య మ్యూజిక్ వారు నిర్వహిస్తున్న ఆదిత్య మూవీస్ విభాగానికి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ లో అప్ లోడ్ చేసిన వివిధ తెలుగు హీరోల, హిందీ డబ్బింగ్ సినిమాలకు భారీగా వ్యూస్ వస్తున్నాయి. తాజాగా హీరో నితిన్ నటించిన సూపర్ హిట్ సినిమాలు అఆ, చల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం హిందీ డబ్ వెర్షన్ కు ఓవర్ ఆల్ గా 392 మిలియన్ల వ్యూస్ రావడం విశేషం. ఇందులో అఆ కు 182 మిలియన్ల వ్యూస్, అ ఆ 2 (ఛల్ మోహన్ రంగ హిందీ వెర్షన్) కు 110 మిలియన్ల వ్యూస్, శ్రీనివాస కళ్యాణం కు 100 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. నితిన్ నటించిన ఈ మూడు సినిమాలుకి సంబంధించిన హిందీ డబ్బింగ్ రైట్ ఆదిత్య మూవీస్ తోనే ఉన్నాయి. అలానే ఈ మూడు సినిమాలు నితిన్ కెరీర్ లో వరుసగా రిలీజ్ అవ్వడం విశేషం.
ఈ సందర్భంగా సంస్ధ మేనెజింగ్ డైరెక్టర్ ఉమేశ్ గుప్త మాట్లాడుతూ, మా ఆదిత్య మూవీస్ ఛానల్ ని విశేషంగా ఆదరిస్తున్న వ్యూయర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలానే హీరో నితిన్ గారికి ఆయన నటించిన సంబంధిత సినిమాలు బృందాలకి నా అభినందనలు, కృతజ్ఞతలు తెలుతున్నాను. త్రివిక్రమ్ గారు డైరెక్షన్ లో నితిన్ హీరో గా వచ్చిన అ ఆ సినిమాను హిందీలోకి డబ్బింగ్ చేయడంతోనే మా ఆదిత్య మూవీస్ మొదలైంది. సాధారణంగా యాక్షన్ మూవీస్ ఇష్టపడే నార్త్ ఆడియన్స్, అ ఆ వంటి ఫ్యామిలీ ఎంటెర్టైనెర్ ని విశేషంగా ఆదరించారు. అనూహ్యంగా ఆ తరువాత కూడా నితిన్ నుంచి వచ్చిన చల్ మోహన్ రంగా, శ్రీనివాస కళ్యాణం సినిమాలకి భారీగా స్పందన లభించడం విశేషం అని తెలిపారు. అలానే కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రజలందరు ఇంటికే పరిమితమై ప్రభుత్వ వర్గాలకి సహకరించాలని ఉమేశ్ అన్నారు. డైరెక్టర్ ఆదిత్య గుప్త మాట్లాడుతూ మమల్ని ఆదిరిస్తున్న అన్ని వర్గాల ప్రేక్షకులకి మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటాము. అలానే మమల్ని నమ్మి మాకు అవకాశం ఇచ్చిన హీరో నితిన్ గారికి, దర్శక నిర్మాతలకు నా అభినందనలు, ధన్యవాదాలు అని అన్నారు.