ESI స్కామ్ లో మరో అవినీతి చేప ..!

గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయం మొత్తం తెలుగుదేశం పార్టీ నేతల అరెస్టుల చుట్టూనే తిరుగుతూ ఉంది. ఈఎస్ఐ స్కాం లో టీడీపీ ఎమ్మెల్యే మరియు మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ విషయంలో ఎంత పెద్ద రచ్చ జరిగిందో అందరికీ తెలిసిందే.

రోజుకు ఒక కొత్త మలుపు తీసుకున్న అతని కేసు విచారణ తిరిగి తిరిగి మరో టిడిపి నేత వద్దకు వచ్చి ఆగింది. టిడిపి పార్టీలో మరొక సీనియర్ నేత మరియు మాజీ మంత్రి పితాని సత్యనారాయణ యొక్క పర్సనల్ సెక్రెటరీ మురళీమోహన్ ను ఏసీబీ అధికారులు కొద్దిసేపటి క్రితమే అదుపులోనికి తీసుకున్నారు.

అయితే పితాని తనయుడు సురేష్ పేరు మరియు మురళీమోహన్ పేర్లు ఈ స్కామ్ లో ముందు నుంచి వినిపిస్తున్నా వీరిద్దరూ అరెస్టు భయంతో ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం కోర్టు వారిని సంప్రదించారు. అయితే వారి పిటిషన్ రిజర్వ్ లో ఉండగానే ఏసీబీ అధికారులు మురళీ మోహన్ ను హుటాహుటిన వారిని అరెస్టు చేయడం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here