సోషల్ మీడియాలో అభిమానిని ఓదార్చిన అల్లు శిరీష్..

అల్లు శిరీష్ హీరోగా నటించిన శ్రీరస్తు శుభమస్తు సినిమా ఈ మధ్యే 5 ఏళ్ళు పూర్తి చేసుకుంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. శిరీష్‌కు అభిమానులను తీసుకొచ్చింది ఈ చిత్రం. ఈ సినిమా నుంచి ఓ వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో ఎమోషనల్ డైలాగ్‌తో ఆకట్టుకున్నారు శిరీష్. ఇందులో అల్లు శిరీష్ కారెక్టర్ ఈ డైలాగ్ చెప్తుంది. ఎవర్నీ ఎక్కువగా ప్రేమించకూడదు.. అలా చేస్తే ఓ బ్యాగేజ్ మనం మోస్తున్నట్లే.. మనల్ని మనం చంపుకునేలా చేస్తుంది ఈ ప్రేమ అంటూ శిరీష్ చెప్పిన డైలాగ్ చాలా ఎమోషనల్‌గా ఉంది. ఈ మాటలు చాలా మందికి కనెక్ట్ అయ్యాయి.

మరీ ముఖ్యంగా ఓ అభిమాని అయితే దీన్ని చాలా వ్యక్తిగతంగానూ తీసుకున్నాడు. తనకు తాను అప్లై చేసుకున్నాడు. ఈ వీడియోను పోస్ట్ చేసి సేమ్ ఫీలింగ్ అంటూ పోస్ట్ చేసాడు. దానికి వెంటనే స్పందించిన అల్లు శిరీష్.. అయ్యో ఏమైంది బ్రదర్ అంటూ అడిగాడు. అది కేవలం సినిమా డైలాగ్ మాత్రమే. నీకు కూడా మంచి కాలం వస్తుంది. అన్నింటికీ కాలమే సమాధానం చెప్తుంది అంటూ రిప్లై ఇచ్చారు శిరీష్. దాంతో పాటు ఓ హగ్, హార్ట్ సింబల్స్‌ ఎమోజీలుగా పోస్ట్ చేసారు శిరీష్. అలా ఆయన అభిమానిని ఓదార్చారు.

ప్రస్తుతం అల్లు శిరీష్ ప్రేమ కాదంట సినిమాతో బిజీగా ఉన్నారు. అందులో ఎమోషనల్ పాత్రలో నటిస్తున్నారు శిరీష్.
శ్రీరస్తు శుభమస్తు, కొత్తజంట లాంటి సినిమాలతో విజయాలు అందుకోవడమే కాదు.. అభిమానులను కూడా సంపాదించుకున్నారు శిరీష్. ప్రేమ కాదంట సినిమాలో ఈయన్ని చూడ్డానికి అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఈయన నటించిన క్రైమ్ థ్రిల్లర్స్, ఎమోషనల్ డ్రామాల్లో కూడా అమ్మాయిలను కాపాడే పాత్రలే చేసారు అల్లు శిరీష్. అభిమానులు అన్ని జోనర్స్‌లో శిరీష్‌ను చూడ్డానికి ఇష్టపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here