ఆగస్టు 23న నెట్ ఫ్లిక్స్ లో నేరుగా విడుదల కానున్న ఐశ్వర్య రాజేష్ ‘భూమిక’

టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ సమర్పణలో వస్తున్న సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ భూమిక. స్టోన్ బెంచ్ ఫిలిమ్స్, ప్యాషన్ స్టూడియోస్ బ్యానర్స్ పై కార్తికేయ సంతానం, సుదాన్ సుందరం, జయరామన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రథింద్రన్ ఆర్ ప్రసాద్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రతిక్షణం ఈ ట్రైలర్ ఆకట్టుకునేలా డిజైన్ చేశారు మేకర్స్. ఆగస్టు 23న నెట్ ఫిక్స్ లో నేరుగా విడుదల కానుంది. తమ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని నమ్మకంగా చెబుతున్నారు దర్శక నిర్మాతలు. సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్లకు భూమిక మరింత ఆకట్టుకోవడం ఖాయం. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే చిత్రయూనిట్ తెలియజేయనున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here