గాల్వాన్‌ లోయ నుంచి వెనక్కు తగ్గిన చైనా సైన్యం..ఫలించిన భారత్ మంత్రాంగం.

జూన్ 15న సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ వెంబడి తూర్పు లడఖ్‌లోని గల్వాన్ లోయ వద్ద భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

సరిహద్దుల్లో గత రెండు నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత కొంత తగ్గుముఖం పట్టి, సాధారణ పరిస్థితులు నెలకున్నాయి. జూన్ 15న ఘర్షణ చోటుచేసుకున్న గాల్వాన్ లోయ నుంచి చైనా సైన్యం వెనక్కు తగ్గింది. ఆ ప్రాంతంలో ఇరు సైన్యాలు తాత్కాలిక నిర్మాణాలు నిలిపివేసి, వెనక్కు వెళ్లినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దళాలు రెండు కిలోమీటర్ల మేర వెనక్కు వెళ్లినట్టు పేర్కొన్నాయి. జూన్ 30న ఇరు దేశాల సైనికాధికారుల మధ్య జరిగిన చర్చల్లో బలగాల ఉపసంహరణపై ఓ నిర్ణయానికి వచ్చిన విషయం తెలిసిందే.

మూడోసారి చర్చలు జరిగినప్పుడు..జూన్ 22న జరిగిన చర్చల్లో ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహనకు కట్టుబడి ఉండాలని భారత్ ఉద్ఘాటించింది. జూన్ 22 నాటి చర్చల్లో గాల్వన్ లోయ, గోగ్రా-హాట్‌స్ప్రింగ్, పాంగాంగ్ సరస్సు వద్ద ఇరు దేశాల సైన్యాలు ప్రస్తుతం ఉన్న స్థానం నుంచి భౌతికంగా కనీసం 2.5 నుంచి 3 కిలోమీటర్ల మేర వెనక్కువెళ్లాలని నిర్ణయించామని, దీనిని తప్పకుండా అమలుచేయాల్సిందేనని భారత్ బృందం స్పష్టం చేసింది.

ముఖ్యంగా పాంగాంగ్ సరస్సు ఉత్తర తీరంలో ఫింగర్ 4 నుంచి 8, గాల్వన్ లోయ పెట్రోలింగ్ పాయింట్ 14, దెప్సాంగ్ వద్ద బాటిల్‌నెక్ నుంచి చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సేనలు వైదొలగాలని డిమాండ్ చేసింది. తూర్పు లడఖ్‌లోని పాంగాంగ్ సరస్సు ఉత్తర తీరంలో భారత భూభాగంలో దాదాపు 8 కిలోమీటర్ల మేర చొచ్చుకొచ్చిన చైనా.. అది తమ భూభాగమేని వాదించిన విషయం తెలిసిందే. అక్రమంగా చొరబడటమే కాదు, దానిని తమ భూభాగమేనంటూ చైనా పదే పదే ఆ పాటే పడుతోంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here