ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆనందం వ్యక్తం చేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానంలో సన్నిధి గొల్లకు వంశపారంపర్యం హక్కును కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం తెలపడం ఆనందదాయక అంశమని తెలంగాణ రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు.
ఎంతో కాలంగా పరిష్కారం కాకుండా ఉన్న ఈ సమస్యను ఓ కొలిక్కి తెచ్చినందుకు ఏపీ సీఎం జగన్కు తలసాని ధన్యవాదాలు తెలిపారు. వంశ పారంపర్య హక్కు కల్పిస్తూ తీసుకున్న ఈ నిర్ణయంతో జగన్ యాదవుల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోతారని మంత్రి తలసాని కొనియాడారు.