మండలిలో మంత్రిపై టీడీపీ సభ్యుల దాడి…!

శాసన మండలిలో బుధవారం షాకింగ్ ఘటనలు జరిగాయి. మండలిలో మంత్రిపై టీడీపీ ఎమ్మెల్సీలు దాడి చేసినట్లు వైసీపీ సభ్యులు ఆరోపించారు.

శాసన మండలిలో బుధవారం షాకింగ్ ఘటనలు చోటుచేసుకున్నాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ సభ్యులు సభలోనూ తన్నుకున్నారు. రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ను టీడీపీ ఎమ్మెల్సీలు బీద రవిచంద్ర, మంతెన సత్యనారాయణ రాజు కొట్టినట్లు తెలుస్తోంది.

వెల్లంపల్లిని ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు మెడపట్టి నెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.ఓ వైపు సభ జరుగుతుంటే టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ఫొటోలు తీస్తూ నిలుచ్చున్నారని మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. దీన్ని ప్రశ్నించేందుకు ముందుకెళ్లిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై దాడి చేశారని మంత్రి ఆరోపించారు. మండలిలో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయని మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగా సభను అడ్డుకునేందుకు టీడీపీ నేతలు కుట్రపూరితంగా వ్యవహరించారని పేర్కొన్నారు. కావాలనే బిల్లులను అడ్డుకున్నారని మండిపడ్డారు.

అలాగే మండలిలో చైర్మన్ నిర్ణయాలు అప్రజాస్వామ్యంగా ఉన్నాయని మండలిలో వైసీపీ పక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. కీలక బిల్లులు ఆమోదించకుండానే నివరధిక వాయిదా వేశారని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here