తన ఆరోగ్య పరిస్థితి బాగాలేదని తనను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించేలా ఆదేశించాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు తీర్పును ఇచ్చింది.
ఈఎస్ఐ స్కాంలో అరెస్టై జైల్లో ఉన్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. అచ్చెన్నాయుడును ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలని హైకోర్టు ఆదేశించింది. అచ్చెన్నను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించడంపై ప్రభుత్వం తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడును ఏ ఆస్పత్రికి తరలించాలన్నది ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ నిర్ధారించాలన్నారు. ప్రభుత్వ తరుపు న్యాయవాది వాదనను ధర్మాసానం తోసిపుచ్చింది. అచ్చెన్నాయుడును గుంటూరు రమేష్ ఆస్పత్రికి తరలించే అవకాశం ఉంది.
అచ్చెన్న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆరోగ్యం బాగా లేకపోయినా బలవంతంగా తనను జిల్లా జైలుకు తరలించారని.. ఆయన తరపున లాయర్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. తన ఆరోగ్య పరిస్థితి బాగాలేదని తనను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించేలా ఆదేశించాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు తీర్పును ఇచ్చింది. ఇటు బెయిల్ కోసం అచ్చెన్నాయుడు వేసిన పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పుతో అచ్చెన్నను ఏ ఆస్పత్రికి తరలిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.