పతంజలి ఆయుర్వేద మందు విడుదల చేసిన రాందేవ్ బాబా

యావత్ ప్రపంచం మొత్తం ఇప్పుడు ఈ మహమ్మారిని అంతమొందించే మెడిసిన్ కోసం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో వైరస్ మహమ్మారికి తాము ఆయుర్వేద మెడిసిన్ కనుగొన్నట్టుగా ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ పతంజలి ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ మెడిసిన్ ను బాబా రాందేవ్ చేతుల మీదుగా మార్కెట్ లోకి విడుదల చేశారు.

కరోనిల్ పేరుతో తయారుచేసిన ఔషదాన్ని మంగళవారం హరిద్వార్ లో విడుదల చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో రాందేవ్ బాబా పతంజలి సంస్థ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తమ సంస్థ తయారుచేసిన ఔషధం వైరస్ చికిత్సలో ఉపయోగపడుతుందని పతంజలి కార్యనిర్వహణాధికారి ఆచార్య బాలకృష్ణ అన్నారు. కోవిడ్-19కు కారణమయ్యే సార్స్-కోవి-2 వైరస్ను తాము తయారుచేసిన దివ్య కరోనిల్ సమర్ధంగా ఎదుర్కొంటుందని పరిశోధనలతో తేలిందని తెలిపారు.

ప్రాణాంతక ఈ అంటువ్యాధికి ఇతర సంస్థల కంటే ముందుగా సాక్ష్యం ఆధారిత ఆయుర్వేద ఔషధాన్ని తయారుచేసి ఆవిష్కరించడం ఎంతో గర్వంగా ఉందన్నారు ఆచార్య బాలకృష్ణ అన్నారు. అశ్వగంధ గిలోయ్ తులసితో కలిపి కరోనిల్ను కరోనా బాధితులకు చికిత్సలో వినియోగించినప్పుడు 100 శాతం మంది కోలుకున్నారని బాబా రాందేవ్ తెలిపారు.

పతంజలి రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ జైపూర్లో ని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సంయుక్తంగా రూపొందించినట్టు వెల్లడించారు. క్లినికల్ ట్రయల్స్ కేసులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఈ మందును తీసుకొచ్చామని ఆయన వివరించారు. మూడు రోజుల్లో ఈ మందుతో చాలా మంది కోలుకున్నారని చెప్పారు. ఈ మందును తీసుకురావడంతో కృషి చేసిన శాస్త్రవేత్తలకు ఆయన అభినందనలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here