ఏపీ సీఎం ‌పై కాంగ్రెస్ మాజీ సీఎం సిద్ధరామయ్య ప్రశంసల జల్లు..

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ మాజీ సీఎం సిద్ధరామయ్య ప్రశంసల జల్లు కురిపించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై కర్ణాటక మాజీ సీఎం, ప్రస్తుత రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు సిద్ధరామయ్య ప్రశంసలు జల్లు కురిపించారు.ముఖ్యమంత్రి జగన్ డాక్టర్స్ డే సందర్భంగా జూలై 1న రాష్ట్రవ్యాప్తంగా వెయ్యికి పైగా 108, 104 అంబులెన్సులు ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా సీఎం జగన్‌ను రాజకీయాలకు అతీతంగా ప్రశంసించారు. తాజాగా, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, మాజీ సీఎం సిద్ధరామయ్య సైతం సీఎం జగన్ను ప్రశంసిస్తూ.. ఆ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఈ మేరకు ఆదివారం సీఎం సిద్ధరామయ్య ట్వీట్ చేశారు.

‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రూ. 200 కోట్ల వ్యయంతో 1,000 కి పైగా అంబులెన్స్ సేవలను ప్రారంభించారు. మా రాష్ట్రంలో అంబులెన్స్ లేక ప్రజలు వీధుల్లో చనిపోతున్నారు. ఇలాంటి చూసైనా నేర్చుకోండి.’’ అంటూ సిద్ధరామయ్య ట్వీట్ చేశారు.కాగా, రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ, ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాడు- నేడుకు తోడు కొత్తగా వైసీపీ ప్రభుత్వం 108, 104 అంబులెన్సులు అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 1 (బుధవారం)న ఈ వాహనాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడలో జెండా ఊపి ప్రారంభించారు. విజయవాడ నుంచి అంబులెన్సులు కుయ్, కుయ్ అంటూ రాష్ట్ర నలుమూలలకు తరలి వెళ్లాయి. ఈ వాహనాల్లో 676 వాహనాలు 104 కాగా.. మరో 412 వాహనాలు 108లు.

ప్రభుత్వం కొత్తగా అత్యాధునిక వైద్య సేవలందించే ఈ అంబులెన్సులలో 282 బేసిక్‌ లైఫ్‌ సపోర్టు (బీఎల్‌ఎస్‌)కు సంబంధించినవి.. 104 అడ్వాన్స్‌ లైఫ్‌ సపోర్టు (ఏఎల్‌ఎస్‌)తో తీర్చిదిద్దారు. మరో 26 అంబులెన్సులను చిన్నారులకు (నియో నేటల్‌) వైద్య సేవలందించేలా తయారు చేశారు. 104 సర్వీసుల్లో సమూల మార్పులు చేసిన ప్రభుత్వం, హెల్త్‌ కేర్‌ డెలివరీకి అవకాశం ఉంటుంది. ఆ స్థాయిలో మొబైల్‌ మెడికల్‌ యూనిట్ల (ఎంఎంయూ)ను తీర్చిదిద్దారు. మారుమూల ప్రాంతాల్లో కూడా అత్యాధునిక వైద్య సేవలందించే విధంగా, అన్ని వసతులతో ఎంఎంయూలను సిద్ధం చేశారు. ప్రతి మండల కేంద్రంలో ఒక సర్వీసు అందుబాటులో ఉండే విధంగా ఒకేసారి వాహనాలను సిద్ధం చేశారు.

దాదాపు 203.47 కోట్లతో అంబులెన్స్ వాహనాలు కొనుగోలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. ప్రతి మండలంలో ఎక్కడైనా ప్రమాదం జరిగితే అక్కడికి 20 నిమిషాల్లో చేరేలా ప్రభుత్వం రూట్ మ్యాప్ సిద్ధం చేసింది. పట్టణ ప్రాంతాల్లో అయితే ఫోన్‌ చేసిన 15 నిమిషాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 20 నిమిషాల్లో, ఏజెన్సీ (గిరిజన) ప్రాంతాల్లో అయితే 25 నిమిషాల్లో అంబులెన్స్‌లు చేరే విధంగా ప్లాన్ చేశారు.ప్రతి అంబులెన్స్‌ను ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సెంటర్‌ (ఈఆర్‌సీ)తో అనుసంధానం చేయడం ద్వారా, ఫోన్‌ చేసిన వారిని వేగంగా ట్రాక్‌ చేసే వీలు కలుగుతుంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here