ఎంపీ రఘురామకృష్ణరాజుకు షాకిచ్చిన వైసీపీ

ఎమ్మెల్యేలు గ్రంధి శ్రీనివాస్, ప్రసాదరాజు కూడా అదే బాటలో నడిచారు. గ్రంధి శ్రీనివాస్ భీమవరం పోలీసులకు ఎంపీపై ఫిర్యాదు చేశారు. తన సహచర ఎమ్మెల్యేలను అసభ్య పదజాలంతో కించపరిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పార్టీలో వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని తెలిపారు.

 

 

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు ప్రకటించారు. ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే మంత్రి శ్రీరంగనాథరాజు ఫిర్యాదు చేయగా.. ఎమ్మెల్యేలు గ్రంధి శ్రీనివాస్, ప్రసాదరాజు కూడా అదే బాటలో నడిచారు. గ్రంధి శ్రీనివాస్ భీమవరం పోలీసులకు ఎంపీపై ఫిర్యాదు చేశారు. తన సహచర ఎమ్మెల్యేలను అసభ్య పదజాలంతో కించపరిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పార్టీలో వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ఇటు నర్సాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు కూడా ఫిర్యాదు చేశారు. అలాగే మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కారమూరి నాగేశ్వరరావు, కొట్టి సత్యనారయణ కూడా ఫిర్యాదుకు సిద్ధమవుతున్నారు.

ఆ తర్వాత రఘురామకు పార్టీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. దీనిపైనా అభ్యంతరం చెబుతూ ఎంపీ కౌంటర్ ఇచ్చారు.. అలాగే అధినేత జగన్‌కు కూడా లేఖ రాశారు. ఆ వెంటనే వైఎస్సార్‌సీపీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.. రఘురామపై అనర్హత వేటు వేయాలని కోరారు. ఇటు ఎంపీ కూడా హైకోర్టులో పిటిషన్ వేయగా.. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు కూడా ఫిర్యాదులతో షాకిస్తున్నారు.

ఇళ్ల పట్టాలు, ఇసుక విషయంలో మంత్రి, సొంత పార్టీ ఎమ్మెల్యేలుపై ఎంపీ రఘురామ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇళ్ల కేటాయింపుల్లో అక్రమాలు జరుగుతున్నాయని, కొనుగోళ్లలో కూడా గోల్‌మాల్‌ జరుగుతోందన్నారు. అలాగే ఇసుక మాఫియా వెనుక ఎమ్మెల్యేల ఉన్నారని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై గతంలో దుమారం రేగా.. ఎంపీకి ఎమ్మెల్యేలు కూడా కౌంటర్ ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ నేతలు కాళ్లా వేళ్లా పడి బతిమాలితేనే తాను పార్టీలో చేరానని అన్నారు. మంత్రి శ్రీరంగనాథరాజుపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here