తెలుగు కామెడీ షో జబర్దస్ షో ద్వారా తెలుగు ప్రజలకు ఎంతో చేరువైన యాంకర్ అనసూయ…ఈ కార్యక్రమం ద్వారా కొద్ది కాలంలోనే మంచి పాపులారిటీ సాధించుకుంది. ఈ క్రమంలో ఇటీవల ఓ అభిమానిపై అనసూయ చేయిచేసుకున్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్ కావడంతో ఆమె పై అనేక మంది నెటిజన్లు విమర్శించడం జరిగింది. దీంతో, కొంత కాలం పాటు ట్విట్టర్, ఫేస్ బుక్ కు దూరంగా ఉంటున్నట్టు అనసూయ ప్రకటించారు. ఫిబ్రవరి 6వ తేదీన తన అకౌంట్లను డిజేబుల్ చేశారు.
మొత్తానికి తాజాగా నిన్న ఆ అకౌంట్ల ద్వారా రీఎంట్రీ ఇచ్చారు. ఫేస్ బుక్ అకౌంట్ ను నిన్న యాక్టివేట్ చేసి, రంగస్థలం ట్రైలర్ ను అప్ లోడ్ చేశారు. అలానే ట్విట్టర్ అకౌంట్ ను ఈ రోజు యాక్టివేట్ చేసిన ఆమె రంగస్థలం సినిమాలో తాను పోషించిన రంగమ్మత్త ఫొటోను పోస్ట్ చేసి ఆమె అభిమానులకు శుభవార్త అందించారు….ఈ సందర్భంగా యాంకర్ అనసూయ జరిగే సోషల్ మీడియా లో రావడంతో ఆమె అభిమానులు ఎంతగానో సంతోషపడుతున్నారు.