మోడీ స్వయంగా చెన్నైకి వెళ్లి కలిసినా.. తనే వెళ్లి కరుణానిధిని కలిసినా.. జయలలిత మరణంపై స్పందించినా.. జల్లికట్టు పోరాటానికి మద్దతు తెలిపిపా.. ఏనాడూ రాజకీయాలపై సూపర్ స్టార్ రజనీకాంత్ ఆసక్తి చూపించలేదు. జయలలిత మరణం తర్వాత.. తమిళనాడును ముందుకు తీసుకుపోగలిగేది రజనీకాంత్ మాత్రమే అని అంతా అనుకుననా.. ఆయన మాత్రం ముందుకు రాలేదు.
కానీ.. ఏదో ఒక సందర్భంలో.. ఏదో ఒక రకంగా.. రజనీకాంత్ రాజకీయ ప్రవేశం గురించి చర్చ నడుస్తూనే ఉంది. ఇప్పుడు.. తాజా చర్చకు.. మాజీ హీరోయిన్ నగ్మా కారణమైంది. ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న నగ్మా.. ఈ మధ్య రజనీకాంత్ ను కలిసింది. తనకు ఇష్టమైన నటుడిని కలిశానని ట్వీట్ చేసిన నగ్మా.. చాలా విషయాలపై రజనీతో చర్చించినట్టు ట్వీట్ లో తెలిపింది.
రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే.. ఘన విజయాన్ని తప్పక సాధించడం కూడా ఖాయమని నగ్మా కామెంట్ చేసింది. ఈ విషయంపై ఇంత వరకూ రజనీ నుంచి ఎలాంటి సమాధానం రాకున్నా.. మరోసారి ఆయన పాలిటిక్స్ లో ప్రవేశించే విషయంపై చర్చ మొదలైంది.