పొలిటికల్ నేతలలో లోకేష్ అయన భార్య తీరు భలే చూడ ముచ్చటగా ఉంటుంది. చిన్న తనం నుంచీ బావా మరదళ్ళు అయిన వీరిద్దరూ ప్రేమించి పెద్ద అంగీకారం తో పెళ్లి చేసుకుని దేవాన్ష్ కి జన్మని ఇచ్చారు. తాజాగా మంత్రి అయిన లోకేష్ గురించి నారా బ్రాహ్మణి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఇదివరకు ఆయన కనీసం మెసేజ్ అయినా పెట్టేవారు అనీ ఆ రకంగా తనతో టచ్ లో ఉండేవారు అనీ ఇప్పుడు మంత్రి అయిన తరవాత ఆ మాత్రం కూడా చెయ్యడం లేదు అనీ అన్నారు ఆవిడ.
ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. మామయ్య చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా, లోకేశ్ మంత్రిగా ఇద్దరూ అమరావతి అభివృద్ధిలో ఊపిరి సలపనంత బిజీగా ఉన్నారని పేర్కొన్నారు. లోకేశ్ గతంలో మెసేజ్లతో టచ్లో ఉండేవారని, కానీ మంత్రి అయ్యాక అవి కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారిద్దరి ముందు చాలా పెద్ద గోల్ ఉందని అన్నారు.