తెలంగాణా లో రిజర్వేషన్ లు కల్పించడం కోసం ఇవాళ ప్రత్యేకంగా అసంబ్లీ ని ఏర్పాటు చేసిన కెసిఆర్ మీద తెలుగుదేశం, బీజేపీ పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి. మైనారిటీ ల కోట్ల కోసం రాజ్యాంగానికి విరుద్ధంగా కెసిఆర్ ప్రభుత్వం నడుస్తోంది అని ఏ రాష్ట్రం లో కూడా రిజర్వేషన్ ల పెంపుకి అనుమతి లేని టైం లో రిజర్వేషన్ కోటా ఎలా పెంచుతారు అంటూ బీజేపీ ప్రశ్నిస్తోంది. మతపరమైన రిజర్వేషన్ లకి బీజేపీ పూర్తి వ్యతిరేకం అంటూ కిషన్ రెడ్డి స్పష్టం చేసారు.
కెసిఆర్ ఎత్తులని తాము అడ్డుకుంటాం అని పిలుపు ఇచ్చారు ఆయన. తెలుగుదేశం సైతం టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోంది. నేడు ఉదయం 10 గంటలకు ట్యాంక్ బండ్ పై అంబేద్కర్ విగ్రహం వద్ద టీడీపీ ధర్నా చేసింది. ఇవాళ ఉదయం 11 గంటలకు శాసనసభ, సాయంత్రం 4 గంటలకు శాసన మండలిలో రిజర్వేషన్ల బిల్లుపై చర్చ సాగనున్న సంగతి తెలిసిందే.